
మంత్రి వీరాంజనేయులు విస్తృత పర్యటన
ఎంవీపీకాలనీ: రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి వీరాంజనేయులు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఎంవీపీ కాలనీలోని సంక్షేమ భవన్తో పాటు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయం ఉద్యోగులు పనితీరు, అడ్మినిస్ట్రేషన్ పనితీరుపై ఆరా తీశారు. సంక్షేమ భవన్ పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ కార్యాలయాన్ని, మీటింగ్ హాల్ను పరిశీలించారు. పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లోని హాస్టళ్ల ఆధునికీకరణ పనులను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.