
పోర్టు స్టేడియంలోనే డీఎస్పీ మ్యూజికల్ నైట్
సీతమ్మధార: ఈ నెల 19న పోర్టు స్టేడియంలో దేవిశ్రీప్రసాద్(డీఎస్పీ) మ్యూజికల్ నైట్ యథావిధిగా జరుగు తుందని ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. కొద్ది రోజుల కిందట నిర్వాహకులు మ్యూజికల్ నైట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. భద్రతా ఏర్పాట్లులేవని పోలీసులు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో పోలీసులు సూచించిన భద్రతా ఏర్పాట్లు చేస్తూ, నిర్వాహకులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సీఐలు సత్యనారాయణ, అమ్మినాయుడు స్టేడియంను పరిశీలించి, సంతృప్తి వ్య క్తం చేశా రు. ఈ మేరకు ఏసీపీ అనుమ తిని చ్చారు.

పోర్టు స్టేడియంలోనే డీఎస్పీ మ్యూజికల్ నైట్