ఖైదీలకు ‘జ్యోతిర్గమయ’ ఉపయోగకరం | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు ‘జ్యోతిర్గమయ’ ఉపయోగకరం

Apr 18 2025 12:54 AM | Updated on Apr 18 2025 12:54 AM

ఖైదీలకు ‘జ్యోతిర్గమయ’ ఉపయోగకరం

ఖైదీలకు ‘జ్యోతిర్గమయ’ ఉపయోగకరం

ఆరిలోవ: కేంద్ర కారాగారంలో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలు విడుదలైన తర్వాత బాహ్య ప్రపంచంలో పునరావాసం, ఉపాధి కల్పించడానికి ‘జ్యోతిర్గమయ ప్రాజెక్టు’ ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని గురువారం ఆయన సందర్శించారు. జైల్‌ సూపరింటెండెంట్‌ ఎం.మహేష్‌బాబు, అధికారులతో కలిసి పలు బ్యారక్‌లు పరిశీలించారు. అనంతరం నిర్వహించిన జైళ్ల రక్షణపై జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైల్‌ సెక్యూరిటీ పటిష్టంగా ఉండాలన్నారు. ఖైదీలు క్రమశిక్షణతో మెలిగి బాహ్యప్రపంచంలోకి రావాలన్నారు. జ్యోతిర్గమయ ప్రాజెక్ట్‌ గురించి అవగాహన కల్పించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జైలు నుంచి విడుదలైన ఖైదీల వివరాలు సీపీకి జైలు అధికారులు అందజేస్తారు. అలాంటి వారికి సీపీ కౌన్సెలింగ్‌ నిర్వహించి సమాజంలో క్రమశిక్షణతో జీవించడానికి అవసరమైన పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జైల్‌ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జైలు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement