
సెంట్రల్ జైలులో ఓపెన్ ఇంటర్ పరీక్షలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఓపెన్ ఇంటర్(సార్వత్రిక విద్య) పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఓపెన్ ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర కారాగారంలో ఖైదీలకు ప్రత్యేకంగా ఓ సెంటర్ ఏర్పాటు చేశారు. బుధవారం తెలుగు పరీక్ష జరిగింది. 15 మంది ముద్దాయిలు ఓపెన్ ఇంటర్లో చేరినట్లు జైలు సూపరింటెండెంట్ ఎం. మహేష్బాబు తె లిపారు. ఇందులో నలుగురిని ఇటీవల రాజమండ్రి కేంద్ర కారాగారానికి బదిలీ చేయగా.. బుధవారం 11 మంది పరీక్ష రాసినట్లు వివరించారు.