27న విశాఖకు సీఎం | - | Sakshi
Sakshi News home page

27న విశాఖకు సీఎం

Jan 21 2024 1:42 AM | Updated on Jan 21 2024 8:29 AM

- - Sakshi

విశాఖ సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27వ తేదీన విశాఖకు వస్తున్నట్లు ఎమ్మె ల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు భీమిలిలో 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభను విజయవంతం చేసి ఎన్నికల శంఖారావానికి ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు.

ఈ సభకు అవసరమైన స్థలాల పరిశీలన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఆదివారం విశాఖకు వస్తున్నట్లు వెల్లడించారు. లక్షలాది మందితో చేపట్టే సభకు స్థలాలను పరిశీలించడంతో పాటు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement