8న విశాఖకు అమిత్షా
● మోదీ తొమ్మిదేళ్ల పాలనపై భారీ సభ ● ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్న బీజేపీ శ్రేణులు ● విశాఖకు షా రాక ఇది రెండోసారి
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఈనెల 8న విశాఖకు వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా విశాఖలోనూ అలాంటి సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం లేదా రైల్వే గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు యోచిస్తున్నారు. అమిత్షా సభకు బూత్కు కనీసం పది మంది చొప్పున 1936 బూత్ల నుంచి 20 వేల మందికి పైగా జనాన్ని, కార్యకర్తలను సమీకరించాలని భావిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు శనివారం బీజేపీ కోర్ కమిటీ నేతలు సమావేశమవుతున్నారు. కాగా అమిత్షా విశాఖకు రానుండడం ఇది రెండోసారి. గత సాధారణ ఎన్నికల్లో ఆయన ఎన్ఏడీ నుంచి కంచరపాలెం వరకు నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్నారు. అమిత్షా పాల్గొనే బహిరంగ సభ సమయం ఇంకా ఖరారు కాలేదని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తెలిపారు.