గ్రూప్–1 పరీక్షకు పటిష్ట బందోబస్తు
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో శనివారం జరగనున్న గ్రూప్–1 రాత పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ తెలిపారు. నగరంలో ఆంధ్రాయూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, ఎకనామిక్స్, కామర్స్ బిల్డింగ్లో నిర్వహిస్తున్న ఈ పరీక్ష సుమారు 1300 అభ్యర్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.