● ఆర్థిక ఇబ్బందులే కారణం?
మల్కాపురం: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచివేసింది. వివరాలివీ.. బాపట్ల జిల్లా ఇంకులు మండలానికి చెందిన వంకదారి వీరాంజనేయులు(34) 2009లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా విధుల్లోకి చేరాడు. 2021లో హెచ్పీసీఎల్(విశాఖ రిఫైనరీ) సంస్థకు బదిలీపై వచ్చి.. అప్పటి నుంచి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నా డు. మల్కాపురం సమీపంలోని సీఐఎస్ఎఫ్ క్వార్టర్లో తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా..శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. గదిలోకి నిద్రించడానికి వెళ్లాడని భార్య భావించింది. సాయంత్రం టీ తాగేందుకు అతన్ని నిద్రలేపే ప్రయత్నంలో గది తలుపు కొట్టింది. ఎంతకీ స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి పక్క క్వార్టర్స్లో ఉన్న వారిని పిలిచింది. వారు కిటికీ తెరిచి చూడగా ఫ్యాన్కు వీరాంజనేయులు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని మల్కాపురం పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఆర్థిక ఇబ్బందులే కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.