అనంతగిరి: వికారాబాద్లో మార్క్ఫెడ్, డీసీయంఎస్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ దీపక్ తివారీ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ఽమద్దతు ధరకు విక్రయించుకుని లాభాలు పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, మార్క్ఫెడ్ డీఎం రేఖ, డీసీఎంఎస్ మేనేజర్ సుదర్శన్రెడ్డి, ఏయంసీ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దీపక్ తివారీ


