జల వనరుల సంరక్షణకు సర్వే | - | Sakshi
Sakshi News home page

జల వనరుల సంరక్షణకు సర్వే

Nov 7 2025 8:53 AM | Updated on Nov 7 2025 8:53 AM

జల వనరుల సంరక్షణకు సర్వే

జల వనరుల సంరక్షణకు సర్వే

అనంతగిరి: నీటి పారుదల శాఖ నుంచి వచ్చిన గణాంకాల ఆధారంగా వనరుల సంరక్షణ, నీటి పారుదల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం తన చాంబర్‌లో 7వ మైనర్‌ ఇరిగేషన్‌ సెన్సస్‌, 2వ సెన్సస్‌ ఆఫ్‌ వాటర్‌ బాడీస్‌ డిస్ట్రిక్‌ లెవల్‌ కమిటీ(డీఎల్‌ఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ ఉపరితల, భూగర్భ జల వనరుల నిర్ధారణ కోసం వ్యూహాలను రూపొందించడానికి దోహద పడుతుందన్నారు. ఈ సర్వేలో జీపీఓ, ఏఈవో, పీఎస్‌, టీఏ, ఎఫ్‌ఏలు గణనదారులు(గణన చేయువారు)గా, ఏఈఈ(ఇరిగేషన్‌), ఎంపీఎస్‌ఓలు సూపర్‌వైజర్లుగా, మండల స్థాయి తహసీల్దార్లు చార్జ్‌ ఆఫీసర్లుగా, మున్సిపల్‌ కమిషనర్‌లు మున్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్లుగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ మంగీలాల్‌, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఏఓ రాజరత్నం, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, డీటీడబ్ల్యూ రవి, ఆయా శాఖల అధికారులు రాంచంద్రయ్య, ఉమేశ్‌కుమార్‌, సీపీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement