అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు

Sep 2 2025 1:32 PM | Updated on Sep 2 2025 1:32 PM

అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు

అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు

బంట్వారం: ఉద్యోగులు అంకిత భావంతో పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని జిల్లా కోపరేటివ్‌ అధికారి (డీసీఓ) నాగార్జున అన్నారు. సోమవారం బంట్వారం సహకార సంఘం సీఈఓ బ్రహ్మం పదవీ విరమణ చేయడంతో ఆయనకు సంఘం కార్యాలయంలో అభినందన సభ ఏ ర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన డీసీఓ బ్రహ్మం దంపతులను సన్మానించి మా ట్లాడారు. సీఈఓగా బ్రహ్మం సోసైటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించి మంచి పేరు గడించారన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌గౌడ్‌, నూతన సీఈఓ శ్రీనివాస్‌, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

సహకారం సంఘం సీఈఓగా శ్రీనివాస్‌

బంట్వారం: వ్యవసాయ సహకార సంఘం బంట్వారం సీఈఓగా ఎం.శ్రీనివాస్‌కు పదో న్నతి కల్పించినట్లు జి ల్లా కోపరేటివ్‌ అధికా రి (డీసీఓ) నాగార్జున సోమవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఇప్పటి వరకు సీఈఓగా విధులు నిర్వహించిన బ్రహ్మం సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో అభినందన సభకు హాజరైన డీసీఓ నాగార్జున ఇక్కడే విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు బంట్వారం సొసైటీ సీఈఓగా పదోన్నతి కల్పించామన్నారు. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు.

డీసీఓ నాగార్జున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement