
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా పట్టణంలోని చైన్నె రోడ్డులో వెలసిన ద్రౌపతీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణతో పూజలు ప్రారంభం అయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. హోమ పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజలు చేశారు. కాగా ఉదయం ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి పుర ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, శ్రీకాళహస్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.