
పరిశ్రమల అభివృద్ధి ఉద్యోగాల కల్పనకు కృషి
తిరుపతి అర్బన్ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సాంకేతిక అంశాలను జోడించాలని రాష్ట్ర ఎంఎస్ఎం, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో శుక్రవారం ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎస్పీ సోమనాథ్, రాష్ట్ర ఎంఎస్ఎం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు, కలెక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ సీఈఓ విశ్వ, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1.80 లక్షల మంది ఎంఎస్ఎంఈల రంగంపై ఆధారపడి ఉన్నారని చెప్పారు.