
ప్రభుత్వ బడులకు శ్రీసిటీ చేయూత
● రూ.18 లక్షలతో వసతుల కల్పన
శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో (సీఎస్ఆర్) భాగంగా శ్రీసిటీలోని జపాన్ పరిశ్రమ ఐసాన్ ఆటో పార్ట్స్ ఇండియా సుమారు రూ.18.80 లక్షలతో వివిధ ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసిన వసతులను ఐసాన్ మేనేజింగ్ డైరెక్టర్ యసనోరి సకావే, శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్ఆర్) నిరీషా సన్నారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ విద్యా వసతుల్లో సూళ్లూరుపేట ప్రభుత్వ బాలికల హైస్కూల్లో రూ. 6.50 లక్షల ఖర్చుతో అదనపు మరుగుదొడ్లు, వంట గది నిర్మాణం, సత్యవేడు మండలం రామచంద్రపురంలో రూ.12.30 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడీ భవనం నిర్మించారు. ఈ సందర్భంగా ఐసాన్ మేనేజింగ్ డైరెక్టర్ యసనోరి సకాయి మాట్లాడుతూ.. విద్యా వసతుల కోసం సీఎస్ఆర్ కార్యక్రమాలు చేపట్టడం ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసాన్ పరిశ్రమ ప్లాంట్ హెడ్ యూచి టొమిట, హెచ్ఆర్ జనరల్ మేనేజర్ గోపాల్, ప్రొడక్షన్ కోఆర్డినేటర్ తోషిహిరో సనా, మ్యానుఫ్యాక్చరింగ్ డీజీఎం దేవనాథన్, శ్రీసిటీ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సురేంద్ర కుమార్ పాల్గొన్నారు.

ప్రభుత్వ బడులకు శ్రీసిటీ చేయూత