
కమీషన్లకు కక్కుర్తిపడి
ఉపాధి నిధులతో అవసరం లేని చోట సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టి ఉపాధి నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి నిధులపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చేస్తున్నారన్న విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రైతులకు తెలియకుండానే వారి పొలాల చుట్టు సరిహద్దు కందకాలు (బౌండరీ స్ట్రెంచ్) తవ్వినట్టు బిల్లులు మంజూరు చేసి డబ్బులు దోచేస్తున్నారని పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు.
టి.కుమ్మరపల్లి వద్ద చెరువును ఆక్రమించి అందులోనే గోకులం షెడ్డు నిర్మాణం చేసిన ఓ టీడీపీ నేత