
పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి సిటీ: కేంద్రీయ సంస్కృత వర్సిటీల నాలుగో ఉత్కర్ష మహోత్సవాల్లో తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ అధ్యాపకులు రచించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. మహారాష్ట్ర నాసిక్ నగరంలో చేపట్టిన ఉత్కర్ష మహోత్సవాల్లో ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అధ్యాపకుల బృందం పాల్గొంది. వీసీ మాట్లాడుతూ నేటి తరానికి భారతీయ సంస్కృతిని, జ్ఞానాన్ని అందించేందుకు విద్వాంసులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఎన్ఎస్యూ గణిత విభాగం అధ్యక్షులు రమేష్ బాబు రచించిన వేదిక్ మ్యాథమెటిక్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. చైతన్య ఫిలాసఫీ అనే గ్రంథాన్ని సైతం ఆవిష్కరించారు.
యువకుడి ఆత్మహత్య
రాపూరు : మద్దెలమడుగు వద్ద ఆదివారం రాత్రి రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఒడిశాకు చెందిన అజయ్నాయక్ (20) ఓ దాబాలో వంట మాస్టర్గా పనిచేస్తుంటాడన్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాల కారణంగా గూడ్సు రైలు కిందపడినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.