ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష

Jun 7 2025 1:10 AM | Updated on Jun 7 2025 1:10 AM

ప్రశా

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష

తిరుపతి అర్బన్‌ : డీఎస్సీ పరీక్షలకు తొలి రోజే 126 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం 4 కేంద్రాల్లో మాత్రమే ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్షలు చేపట్టారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో పాటు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ కరకంబాడీ రోడ్డులోని అన్నమాచార్య ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఉదయం జరిగిన సెషన్స్‌కు 573 మందికి 509 మంది మాత్రమే హజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన సెషన్స్‌కు 570 అభ్యర్థులకు 508 మంది హాజరయ్యారు. తొలి రోజు తిరుపతిలోని అన్నమాచార్య కళాశాల , పుత్తూరులోని శ్రీవెంకటేశ్‌ పెరుమాళ్‌ కళాశాల, గూడూరు నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల, విద్యానగర్‌ ఎన్‌బీకేఆర్‌ కళాశాలలో మాత్రమే రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 30 వరకు డీఎస్పీ పరీక్షలకు సంబంధించి 33,607 మంది అభ్యర్థులు సెషన్స్‌ల వారీగా పరీక్షలు రాయాల్సి ఉంది.

తొలిరోజు 126 మంది గైర్హాజరు

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష1
1/2

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష2
2/2

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement