
మళ్లీ రేషన్ కష్టాలు
గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరిగేది. సాఫీగా సాగుతున్న ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా కడుపు కొట్టడమే కాకుండా కార్డుదారులు రేషన్ సరుకుల కోసం అవస్థలు పడేలా చేసింది.
– ిపీ.సుబ్రమణ్యం, వెంకటగిరి,
ఎండీయూ వాహన ఆపరేటర్
మానసికంగా వేధిస్తున్నారు
మా ఆస్తిలో ఉన్న చింత చెట్టు కోసం ఎనిమిది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. చివరికి ఆ చింత చెట్టు నరికేశారు. ఉమ్మడి ఆస్తికి చెందిన సర్వే నం.1276లో భూమిలోని చెట్టును ఎలా నరికేస్తారని నిలదీస్తే అక్రమ కేసుల్లో ఇరికించారు. రికార్డులు తారుమారు చేసి నన్ను మానసికంగా వేధిస్తున్నారు. – పురుషోత్తంరెడ్డి, మారసానివారిపల్లి,
చిన్నగొట్టిగల్లు మండలం
అర్హత ఉన్నా పింఛన్ లేదు
భర్త మృతి చెంది ఏడాది దాటినా పింఛన్రాలేదు. ఒకవైపు వృద్ధాప్య పింఛను అందుకునే వయ సు వచ్చినప్పటికీ ప్రభు త్వం స్పందించ లేదు. దరఖాస్తు చేసుకునేందుకు కూడా వీలు లేదంటున్నారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛను లేకపోవడంతో జీవనం దుర్భరంగా ఉంది. – నీలం లక్ష్మమ్మ,
రామలింగాపురం, గూడూరు మండలం
నా భర్తకు పింఛన్ ఇప్పించండయ్యా
నా భర్త పేరు శ్రీనివాసు లు. వయసు మీదపడి నా పింఛన్ ఇవ్వలేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. గతంలో వలంటీర్లే అన్నీ చూసేవారు. మా వీధిలోకి వచ్చి అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించారు. ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ అవస్థలే. – శ్యామలమ్మ, తిరుపతి
గ్రామ స్థాయిలో వైద్యం దూరం
గత ప్రభుత్వంలో 104 వాహనం ద్వారా గ్రామ స్థాయిలోనే వైద్యమందేది. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి అవసరమైన మందులను అందజేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటన్నింటికీ స్వస్తి పలికింది.
–మురళి, వరదయ్యపాళెం మండలం
●

మళ్లీ రేషన్ కష్టాలు

మళ్లీ రేషన్ కష్టాలు

మళ్లీ రేషన్ కష్టాలు

మళ్లీ రేషన్ కష్టాలు