కోర్టుల్లో 171 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

కోర్టుల్లో 171 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

May 8 2025 12:02 PM | Updated on May 8 2025 12:02 PM

కోర్టుల్లో 171 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

కోర్టుల్లో 171 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

చిత్తూరు అర్బన్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కోర్టుల్లో పలు పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 171 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఇందులో స్టెనోగ్రాఫర్‌ 7, జూనియర్‌ అసిస్టెంట్‌ 25, టైపిస్ట్‌ 13, ఎగ్జామినర్‌ 3, కాపీయిస్ట్‌ 17, ప్రోసెస్‌ సర్వర్‌ 21, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 85 చొప్పున ఖాళీలున్నట్లు తెలిపింది. అభ్యర్థులు www. aphc.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 13 నుంచి వచ్చేనెల 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే జిల్లా కోర్టు పరిధిలో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారు ఈనెల 13 నుంచి వచ్చేనెల 24వ తేదీలోపు చిత్తూరులోని జిల్లా కోర్టుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇతర వివరాలకు చిత్తూరు జిల్లా కోర్టులోని పరిపాలన అధికారిని సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్లుగా అయూబ్‌ ఖాన్‌, గురవయ్య

తిరుపతి రూరల్‌:ఏపీఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్లుగా పి.అయూబ్‌ ఖాన్‌, కె.గురవయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్టు విభాగపు డైరెక్టర్‌గా పి.అయూబ్‌ఖాన్‌, టెక్నికల్‌ విభాగపు డైరెక్టర్‌గా కె.గురవయ్య విధులు నిర్వర్తించనున్నారు. సీఎండీ కె. సంతోష రావు పుష్పగుచ్ఛం అందించారు.

దొంగను పట్టించిన ‘నిఘా’

తిరుపతి క్రైమ్‌: అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ నిఘా నేత్రం ఓ దొంగను పట్టించింది. వివరాలు.. గొల్లవానిగుంట మెయిన్‌ రోడ్‌లోని ఓ ఇంటి యజమాని సెలవులు కావడంతో ఊరికి వెళ్లాడు. ఈ క్రమంలో ఎల్‌హెచ్‌ఎంఎస్‌(లాక్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం) ద్వారా పోలీసులకు చెప్పి ఇంటికి కెమెరాలు పెట్టించాడు. ఓ దొంగోడు ఆ ఇంటోకి రాగానే కంట్రోల్‌ రూమ్‌లో సైరన్‌ మోగింది. ఎస్‌ఐ లోకేష్‌ సిబ్బందితో వెళ్లి దొంగను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement