
వైఎస్సార్సీపీలోకి ‘యాలమూరి’
తిరుపతి మంగళం : ప్రముఖ వ్యాపారవేత్త, యాలమూరి శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం తిరుపతి పద్మావతిపురంలో ని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. యాలమూరి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో తిరుపతి నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి పేదవాడి ముంగిటకే జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కనుమరుగైందని, సంక్షేమ పథకాల ఊసే లేదని విమర్శించారు.