
అల్లూరి త్యాగం అజరామరం
తిరుపతి అర్బన్:బ్రిటీష్ పాలకులపై పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు త్యాగం అజరామరమని కలెక్టర్ వెంకటేశ్వర్ కొనియాడారు. బుధవారం కలెక్టరేట్ లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి నిర్వహించారు. కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ముందుగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం అల్లూరి చేసిన సేవలు మరువలేమన్నారు. బ్రిటీష్ పాలకుల దోపిడీపై గిరిజన ప్రజలను చైతన్యవంతం చేశారని వెల్లడించారు. సెట్విన్ సీఈఓ మోహన్కుమార్, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ జిల్లా అధికారి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.