
పోలీసు వలయంలో సైదాపురం
సైదాపురం: మండల కేంద్రానికి సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న శ్రీనివాస పద్మావతి గని వద్ద మాజీ మంత్రి నిల్కుమార్ యాదవ్ నిరసన వ్యక్తం చేయనున్నట్టు సమాచారం అందడంతో ఆత్మకూరు డీఎస్పీ అలెర్ట్ అయ్యారు. ఆయన పర్యవేక్షణలో సుమారు 100 మంది వరకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో సైదాపురంలో ఉత్కంఠ నెలకొంది. సైదాపురం నుంచి శ్రీనివాస పద్మావతి గని వరకు అడుగుకో పోలీసును నియమించారు. ఇందులో మహిళా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తీరా మాజీ మంత్రి రావడం లేదని సమాచారం అందడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.