
కార్యదర్శుల
సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడితో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సర్వేలతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. విధుల భారం తగ్గించండి సార్ అంటూ కనిపించిన అధికారులందరికీ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో అప్పగించిన సర్వేలతో సతమతమవుతున్నారు. సెలవు రోజుల్లో సైతం సేదతీరే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు.
● 39 రకాల పనుల భారం ● సర్వేలతో సతమతం ● ఒత్తిడికి చిత్తవుతున్న ఉద్యోగులు
సర్వేలకు సిద్ధం అవుతున్న పంచాయతీ కార్యదర్శులు (ఫైల్)
తీవ్రంగా ఒత్తిడి
పంచాయతీ కార్యదర్శులకు తీవ్రంగా పని ఒత్తిడి ఉంది. దీంతో పలువురు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి గుండెపోటుతో మృతి చెందారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు సీరియస్గా తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయక తప్పదని భావిస్తున్నాం. – వెంకట్రావు,
రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, సచివాలయ ఉద్యోగుల సంఘం
మనుషులం కాదా..?
పంచాయితీ కార్యదర్శులు మనుషులు కాదా...? యంత్రం వలే పనిచేయాలని బాధ్యతలు కట్టబెట్టేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 40కి పైగా పను లు చేపట్టాల్సి ఉంది. ఇది ఎలా సాధ్యం అవుతుంది. ముందే ఉద్యోగుల కొరత ఉంది. దీంతో మరింత భారంగా మారుతోంది. మా పరిస్థితులను ఉన్నతాధికారులకు చెిబితే స్టేట్ పాలసీ అంటున్నారు. మా కష్టాలను గుర్తించి పని భారం తగ్గించాలని కోరుతున్నాం. – హరిబాబు, పంచాయతీ సెక్రటరీ
తిరుపతి అర్బన్ : సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు కాస్తా.. సర్వే ఉద్యోగులుగా మారిపోయారు. గతంలో సచివాలయంలో ఉంటూ 200లకు పైగా సేవలు అందించేవారు. అయితే కూటమి సర్కార్లో వారు కేవలం సర్వేలకే పరిమితం అయ్యారు. నిత్యం ఇంటింటికి వెళ్లి ఏదో ఒక్క సర్వే చేయాల్సి వస్తుంది. దీంతో పనిభారం పెరిగిపోతోందని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. స్టేట్ పాలసీ కాబట్టి సర్వే చేయాల్సిందేని అధికారులు చేతులెత్తేస్తున్నారు. రోజుకు 30 నుంచి 80 ఇళ్లు సర్వే చేయాల్సిన వస్తోందని వాపోతున్నారు. ఉదయం 6 గంటలకు యాప్స్ తెరిచి హాజరు నమోదు చేయడంతో మొదలై నిర్ణీత లక్ష్యం చేరుకునే వరకు సమయంతో పని లేకుండా సర్వేల్లోనే నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే రోజు వారీ విధులు, సోమవారం గ్రీవెన్స్, మరోవైపు ఉన్నతాధికారుల జూమ్ మీటింగ్లు, ఫోన్ కాన్ఫరెన్సులతో క్షణం తీరిక లేకుండా పోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లాలి
పంచాయతీ కార్యదర్శులకు సర్వేల భారం తప్పడం లేదు. కార్యాలయంలో ఉండాల్సిన పనిలేకుండా ప్రతి రోజు ఇంటింటికి వెళ్లాల్సి ఉంది. కొన్ని సర్వేలకు ప్రజల నుంచి ఓటీపీలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు ఓటీపీ చెప్పడానికి ఇష్టపడడం లేదు. అయితే ఉన్నతాధికారులు మాత్రం తప్పకుండా ఓటీపీలు నమోదు చేయాలంటున్నారు. దీంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాం. మా బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదు. – వెంకట కిషోర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, సచివాలయ ఉద్యోగుల సంఘం
తప్పు జరిగితే షోకాజ్
పనులు చెప్పడం..ఆ తర్వాత చిన్నపాటి తప్పుడు జరిగినా షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. నిత్యం చెత్త తొలగింపుపై నిఘా పెడుతున్నాం. చెత్త విషయం అందరికీ తెలిసిందే ఏ క్షణం ఎవరురూ చెత్త ఎక్కడ వేస్తారోనని మాకు ఆందోళనగా ఉంటుంది. చెత్త కనపడితే మీకు నోటీస్ తప్పదు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయడమే కష్టంగా ఉంటోంది. ఉన్నతాధికారులు మా సమస్యలపై స్పందించి న్యాయం చేయాలి. – అనిల్కుమార్, పంచాయతీ సెక్రటరీ

కార్యదర్శుల

కార్యదర్శుల

కార్యదర్శుల

కార్యదర్శుల

కార్యదర్శుల

కార్యదర్శుల