
పది ఎకరాల అటవీ భూమి కబ్జాకు యత్నం
సాక్షి టాస్క్ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గం, కలువాయి మండలం, తోపుగుంట సమీపంలోని పది ఎకరాల అటవీ భూమిని ఓ వ్యక్తి అక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆ భూమి సాక్షాత్తు సోమశిల అనుసంధానమైన చైన్నె కాలువ సమీపంలో ఉండడం గమనార్హం. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కలువాయికి చెందిన ఓ వ్యక్తి చదును చేసి సాగు చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాడు. అలాగే ఆ భూమి సమీపంలోనే మరో 4.88 సెంట్లు ఓ వ్యక్తికి అసైన్మెంట్ పట్టా ఇవ్వగా.. ఆ భూమిని కూడా ఆ వ్యక్తి కొనుగోలు చేసి మొత్తంగా సాగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం అంతా సంబంధిత అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.
రుయా పెస్ట్ ఏజెన్సీపై చీటింగ్ కేసు
తిరుపతి తుడా: రుయా ఆస్పత్రిలో పెస్ట్ కంట్రోల్ నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన సాయి సెక్యూరిటీ ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ స్వామిరెడ్డి పై చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. ఎస్వీ మెడికల్ కళాశాల తోపాటు రుయా, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ సర్వీసెస్ నిర్వహించేందుకు సాయి సెక్యూరిటీ ఏజెన్సీ 2021 ఆగస్టు ఒకటిన ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందింది. ఆ సంస్థ తిరుపతికి చెందిన ఎన్.రేణుకకు సబ్కాంట్రాక్టు ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి 39 నెలలకు గాను బ్యాంక్ గ్యారంటీని రేణుక తన ఫిక్సిడ్ డిపాజిట్ ద్వారా మొత్తాన్ని చెల్లించింది. 13 నెలల తర్వాత సబ్ కాంట్రాక్టర్ నుంచి ఆమెను తప్పించారు. అయితే నాలుగేళ్లు కావస్తున్నా సబ్ కాంట్రాక్టర్గా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన ఎన్.రేణుకాకు వాటిని సకాలంలో తిరిగి చెల్లించలేదు. అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని ఇవ్వకుండా మోసగించారు. ఆమె బ్యాంక్ గ్యారంటీ పైనే ఇన్ని రోజులు సాయి సెక్యూరిటీ ఏజెన్సీస్ పెస్ట్ కంట్రోల్ నిర్వహిస్తూ వస్తోంది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. సబ్ కాంట్రాక్టర్ అనేకమార్లు ఈ వ్యవహారంపై రుయా, మెడికల్ కళాశాల, ప్రసూతి ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. తనకు అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉందని, బ్యాంకు గ్యారంటీలను తిరిగి చెల్లించనందున ఏజెన్సీకి బిల్లులు చెల్లించవద్దని ఫిర్యాదులో పేర్కొంది. బ్యాంకు గ్యారంటీ తిరిగి ఇవ్వాలని అనేక మార్లు సాయి ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ స్వామి రెడ్డికి కోరినా స్పందించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసిన విచారిస్తున్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎంపిక
వరదయ్యపాళెం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు తెలిపారు. శ్రీకాళహస్తిలోని సుందరయ్య భవన్లో జరిగిన సమావేశంలో తిరుపతి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులుగా తలారి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా దాసరి జనార్దన్, జిల్లా ఉపాధ్యక్షులుగా గురవమ్మ, ఎన్.రమణయ్య, వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శులుగా ముత్యాలయ్య, రాజగోపాల్, రామచంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సుబ్బమ్మ, నారాయణ, శంకరయ్య, కత్తి గురవయ్య, బాలగురవయ్య, వెంకటకృష్ణయ్య, అముద, శ్రీనివాసులు, హరిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు.

పది ఎకరాల అటవీ భూమి కబ్జాకు యత్నం

పది ఎకరాల అటవీ భూమి కబ్జాకు యత్నం