చరిత్రకు సజీవ సాక్ష్యం చిత్రలేఖనం | - | Sakshi
Sakshi News home page

చరిత్రకు సజీవ సాక్ష్యం చిత్రలేఖనం

Mar 19 2025 12:27 AM | Updated on Mar 19 2025 12:27 AM

చరిత్రకు సజీవ సాక్ష్యం చిత్రలేఖనం

చరిత్రకు సజీవ సాక్ష్యం చిత్రలేఖనం

● శ్రీవిద్యానికేతన్‌లో ప్రారంభమైన విష్ణు ఆర్ట్‌ ఫౌండేషన్‌ ● ముఖ్య అతిథులుగా పాల్గొన్న మోహన్‌ బాబు, మంచు విష్ణు

చంద్రగిరి: చరిత్రకు చిత్రలేఖనం సజీవ సాక్ష్యమని, పురాతన కాలం నుంచి చిత్రాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుంటున్నామని ఎంబీయు ప్రో చాన్సలర్‌, మంచు విష్ణుఆర్ట్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మంచు విష్ణు అన్నారు. మన ప్రాంతంతో పాటు దేశ, విదేశాల్లోని కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2013లో మంచు విష్ణు ఆర్ట్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం విద్యాసంస్థల్లో మంచు విష్ణు ఆర్ట్‌ ఫౌండేషన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ మంచు మోహన్‌బాబు, సీఈఓ విష్ణు లు పాల్గొన్నారు. తొలుత కుటుంబ సమేతంగా మోహ న్‌ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం కళాకారులను మోహన్‌బాబు, మంచు విష్ణు ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement