
పేదల ఇల్లు కూల్చివేత
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): గత ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన ఇళ్లకు ప్రస్తుతం ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఐదు ఇళ్లను రెవెన్యూ అధికారులు మంగళవారం నేలమట్టం చేశారు. రేణిగుంట మండలం కొత్తపాళెం రెవెన్యూ పరిధిలోని లారీ డ్రైవర్ల కాలనీలో గత ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకుని ఉన్నారు. సర్వే నంబర్ 100/1 లోని భూమి, వాగు పోరంబోకు స్థలమని, అందులో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని మంగళవారం ఉదయం వీఆర్వో శంకర్ జేసీబీతో ఐదు ఇళ్లను నేలమట్టం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చడంపై బాధితులు బోరున విలపించారు. దీనిపై తహసీల్దార్కు వివరణ కోరగా అక్రమ కట్టాలను కూల్చివేస్తామని చెప్పారు.
● లంచం ఇవ్వలేని కూల్చి వేశారనంటున్న బాధితులు

పేదల ఇల్లు కూల్చివేత