
శ్రీకాళహస్తిలో మార్పు మొదలైంది
– టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిక
శ్రీకాళహస్తి: నియోజకవర్గంలో మార్పు మొదలైందని మాజీ ఎమ్మెల్యే బియ్యం మధుసూదనరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ యూత్ ఏర్పేడు మండల అధ్యక్షుడు వినోద్రెడ్డి, ఆయన అనుచరులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వినోద్రెడ్డి, ఢిల్లీబాబు, దినేష్ , ఉపేంద్రకుమార్, కుబేరుడు, వెంకటేష్, ప్రశాంత్,భాస్కర్ తదితరులలు ఉన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ప్రెసిడెంట్ కునాటి రమణయ్య యాదవ్, బత్తి శెట్టి, శివయ్య, రామ్మూర్తి, అయోధ్య, కేశవ, రాజశేఖర్, రామాచారి, రవి యాదవ్, గాలి రవి, చల్లా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
కార్ల దొంగ అరెస్ట్
తిరుపతి క్రైమ్ : కార్లు అద్దెకు తీసుకుని ఉడాయించే దొంగను మంగళవారం అలిపిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ రామకిషోర్ తెలిపారు. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చిన్నమీరానికి చెందిన గుద్దేటి మహేష్ నూతన కుమార్ ఫిబ్రవరి 11వ తేదీన నకిలీ ఆధార్ కార్డు వినియోగించి తిరుపతిలో ఓ వ్యక్తి వద్ద బ్రిజా కారును అద్దెకు తీసుకెళ్లాడు. ఐదురోజులపాటు వాడుకుని తెలంగాణ సరిహద్దుల వద్ద కారు జీపీఎస్ పనిచేయకుండా చేశాడు. తన సెల్ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో కారు ఎక్కడ ఉందో గుర్తించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుపతి జూపార్క్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. కారును అపహరించిన కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడిపై కోల్కత్తా, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, భువనేశ్వర్, బెంగళూరు, చైన్నె, బీమవరం, ముంబయిలో ఇదే తరహా కేసులకు సంబంధించి మొత్తం 24 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఐదు సార్లు అరెస్టు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి నుంచి రూ.30లక్షల విలువైన మూడు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసును ఛేదించిన ఎస్ఐ లోకేష్, సిబ్బందికి సీఐ అభినందనలు తెలిపారు.

శ్రీకాళహస్తిలో మార్పు మొదలైంది