
వీఆర్వోకు డబ్బులివ్వలేదనే కక్ష
గత ప్రభుత్వంలో దళారుల మాట నమ్మి వారికి కొంత డబ్బు ఇచ్చి ప్లాట్లు తీసుకున్నాం. వాటిలో ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పట్లో వీఆర్వో శంకర్ వచ్చి మా వద్ద డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అదే వీఆర్వో వచ్చి ఒక ప్లాట్కు రూ.20 వేలు ఇవ్వాలని, లేదంటే మీ ఇళ్లు నేలమట్టం చేస్తామని చెప్పారు. మా దగ్గర డబ్బులు లేకుండా వీఆర్వోకు ఇవ్వలేకపోయాం. అది మనసులో పెట్టుకుని మాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా ఇళ్లను నేలమట్టం చేశారు. ఉన్నతాధికారులు మాపై దయవుంచి మాకు న్యాయం చేయాలి.
– బాధితుడు శివయ్య లారీ డ్రైవర్ల కాలనీ ఎల్లమండ్యం పంచాయితీ