
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. మంగళవారం 27,249 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 562 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.07 లక్షలకు చేరింది. ఒక్క రోజులో 616 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకు న్నవారి సంఖ్య 7.97 లక్షలకు చేరింది. ప్రస్తుతం 5,112 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయి.