
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 26,671 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 556 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.08 లక్షలకు చేరింది. ఒక్క రోజులో 652 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 7.99 లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,955 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.