
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఆదివారం 24,927 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 531 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.14 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 612 మంది కోలుకోగా, ఇప్పటివరకు 8.05 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,630 క్రియాశీలక కేసులున్నాయి.