Telangana: కొత్తగా 42 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 11,474 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 42 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.93 లక్షలకు చేరుకుంది. తాజాగా 45 మంది కోలుకోగా మొత్తం 7.88 లక్షల మంది రికవర్ అయ్యారు. ఇక ప్రస్తుతం 416 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్లో వెల్లడించారు.