ఈఎన్‌టీ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ సుదీప్‌ 

Telangana: Dr Sudeep Is President Of The ENT Association - Sakshi

కేఎంసీలో ముగిసిన రాష్ట్రస్థాయి సదస్సు   

ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన ఈఎన్‌టీ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. చెన్నైలో జరిగిన లైవ్‌ సర్జరీలను ఈ సదస్సులో ప్రదర్శించి.. పలు కొత్త అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించారు. అనంతరం ఈఎన్‌టీ అసోసియేషన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ సుదీప్, ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌గా రమణ, ఉపాధ్యక్షులుగా రవిశంకర్, కార్యదర్శిగా రమేశ్, జాయింట్‌ సెక్రటరీగా రవికాంత్, కోశాధికారిగా సాహెల్‌ హమీద్, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా గిఫ్ట్‌సన్, గౌడ రమేశ్, వెంకటరత్నం ఎన్నికయ్యారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top