సిట్‌ విచారణపై సీజే ఉత్తర్వులు హర్షణీయం: బండి సంజయ్‌  | Telangana: BJP Chief Bandi Sanjay About MLAs Poaching Case | Sakshi
Sakshi News home page

సిట్‌ విచారణపై సీజే ఉత్తర్వులు హర్షణీయం: బండి సంజయ్‌ 

Nov 16 2022 1:12 AM | Updated on Nov 16 2022 1:12 AM

Telangana: BJP Chief Bandi Sanjay About MLAs Poaching Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నలుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభ ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ చేపట్టాలని హైకోర్టు సీజే ఉత్తర్వులు జారీ చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ధర్మాసనం పట్ల తమ కు నమ్మకం ఉందని, వాస్తవాలు వెలుగులోకొచ్చి కుట్రదారులెవరో తేలి దోషులకు తగిన శిక్ష పడుతుందని అభిప్రాయపడ్డారు.

సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరపాలన్నదే బీజేపీ వాదన అని, హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందన్న అభిప్రాయాన్ని సంజయ్‌ ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు. సిట్‌ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదని, ఈనెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో సింగిల్‌ జడ్జికి సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement