సీనియర్ సిటిజన్లను కాపాడిన పోలీసులు | Saroornagar Police Saves Senior Citizens Life | Sakshi
Sakshi News home page

సీనియర్ సిటిజన్లను కాపాడిన పోలీసులు

Oct 18 2020 1:12 PM | Updated on Oct 18 2020 3:39 PM

Saroornagar Police Saves Senior Citizens Life - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వరదల్లో చిక్కుకున్న వృద్ధుల ప్రాణాలు కాపాడటానికి పోలీసులు తెగువ చూపించారు. ప్రాణాలకు తెగించి మరీ వారికి సహాయం చేశారు. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివేకానంద నగర్‌లోకి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఓ ఇద్దరు వృద్ధులు వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని తమ ఇంట్లో చిక్కుకుపోయారు. ఎటూ వెళ్లలేక, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ( హైదరాబాద్‌ వరదలు: వైరల్‌‌ వీడియోలు )

ఈ విషయం తెలుసుకున్న సరూర్‌ నగర్‌ పోలీసులు వారిని రక్షించటానికి రంగంలోకి దిగారు. ఎస్‌ఐ రవికుమార్‌ జేసీబీ సహాయంతో ఇంటి పైకి ఎక్కి వాళ్లిద్దర్ని కిందకు తీసుకువచ్చాడు. అనంతరం అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాడు. వృద్ధలను కాపాడటంలో చొరవ చూపిన ఇన్‌స్పెక్టర్‌ సీతారాం, ఎస్‌ఐ రవి కుమార్‌లను జనం కొనియాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement