అసలు మాత్రమే చెల్లించండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: జలమండలి బిల్లు బకాయిదారులకు సువర్ణావకాశం కల్పించామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పెండింగ్లో ఉన్న నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ చేశామని, కేవలం అసలు మాత్రమే చెల్లించాలని కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్లో జలమండలి వన్ టైం సెటిల్మెంట్ పథకం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు అమలులో ఉంటుందన్నారు. జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.