మెడికల్‌ టూరిజంలో మూడో స్థానం | Hyderabad Third Place In Medical Tourism: Harish Rao | Sakshi
Sakshi News home page

మెడికల్‌ టూరిజంలో మూడో స్థానం

Apr 9 2022 4:33 AM | Updated on Apr 9 2022 8:22 AM

Hyderabad Third Place In Medical Tourism: Harish Rao - Sakshi

కార్యక్రమంలో మంత్రి హరీశ్, డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి 

సాక్షి,హైదరాబాద్‌: మెడికల్‌ టూరిజంలో హైదరాబాద్‌ నగరం దేశంలోనే 3వ స్థానంలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే మరింత మెరుగైన స్థానానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వరల్డ్‌ క్లాస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరుగుతుందని తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లను పెంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కార్పొరేట్‌ ఆసుపత్రుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ పీవీఎస్‌ రాజు, డాక్టర్‌ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement