‘గ్రూప్‌-1’పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీజీపీఎస్సీ | TGPSC Challenges High Court Single Bench Order on Group-1 Results Cancellation | Sakshi
Sakshi News home page

‘గ్రూప్‌-1’పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీజీపీఎస్సీ

Sep 17 2025 2:21 PM | Updated on Sep 17 2025 2:27 PM

Group1 row: TGPSC Approached Telangana HC Division Bench Details

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌ 1 అంశంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీజీపీఎస్సీ(TGPSC) బుధవారం ఆశ్రయించింది. ఇంతకు ముందు సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. గ్రూప్‌ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్‌ ర్యాంకులను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల్లో... టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను ఇచ్చింది. 

ఒకటి.. మెయిన్స్‌ జవాబు పత్రాలను ఎలాంటి అవకతవకలు లేకుండా రీవాల్యూయేషన్‌ చేయాలి. సంజయ్‌సింగ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్‌(సాధారణ పద్ధతి)గా మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. ఆ రీవాల్యూయేషన్‌లోనూ పొరపాట్లు జరిగితే పరీక్ష నిర్వహణకు కోర్టే ఆదేశిస్తుంది. 

రెండోది.. 2024 అక్టోబరు 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్‌ను రద్దు చేసి, పరీక్షలను తిరిగి నిర్వహించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రక్రియను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి అని హైకోర్టు స్పష్టంచేసింది.  మరోవైపు ఈ తీర్పుపై గ్రూప్‌-1 ర్యాంకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈక్రమంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో తదుపరి ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement