ఎనిమిదేళ్ల ప్రేమ.. మధ్యలో మరో అమ్మాయి రావడంతో..

Girl Protest In Front Of Lover House Over Cheating In Marriage Adilabad - Sakshi

సాక్షి,మందమర్రిరూరల్‌(అదిలాబద్‌): వాళ్లిద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు ఇంటి ఎదుట బైఠాయించింది. బాధితురాలికి మహిళా సంఘాల సభ్యులు అండగా నిలిచారు. బాధితురాలి వివరాల ప్రకారం... హన్మకొండకు చెందిన కన్నెబోయిన సౌజన్య, మందమర్రికి చెందిన వంశీ అనే యువకుడు హన్మకొండలో ఫార్మసి చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. గతంలో ఇరు కుటుంబాల సభ్యులు పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. నెలరోజుల తరువాత పెళ్లి విషయం మాట్లాడుకుందామని పెద్దల సమక్షంలో నిర్ణయించుకున్నారు. వారం రోజుల క్రితం సౌజన్య యువకుడికి కాల్‌ చేయగా ఆదివారం మాట్లాడుకుందామని చెప్పాడు. దీంతో సౌజన్య కుటుంబ సభ్యులతో కలిసి మందమర్రి కి వచ్చింది. విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వంశీ ఇంట్లో లేకపోవడంతో న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పేర్కొంది. 

చదవండి: అలర్ట్‌ ఫీచర్‌.. ‘రైలులో ప్రశాంతంగా నిద్రపోవచ్చు’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top