331 మందికి కరోనా పాజిటివ్ | Corona positive for 331 people in Telangana | Sakshi
Sakshi News home page

331 మందికి కరోనా పాజిటివ్

Jan 14 2021 5:35 AM | Updated on Jan 14 2021 5:35 AM

Corona positive for 331 people in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం 38,192 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 331 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 73,50,644 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 2,90,640 మందికి కరోనా సోకిందన్నారు. ఇక మంగళవారం 394 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 2,84,611 మంది కోలుకున్నట్లు తెలిపారు. ఇక ఒక్క రోజులో ముగ్గురు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో 1,571 మంది మరణించారన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు 4,458 ఉండగా, అందులో ఇళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఐసోలేషన్‌లో 2,461 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పది లక్షల జనాభాలో 1,97,491 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వివరించారు. 

ఏపీలో 203 పాజిటివ్‌ కేసులు
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 44,679 మందికి పరీక్షలు నిర్వహించగా, 203 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 1,24,41,272 మందికి పరీక్షలు చేశారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,85,437కి చేరింది. ఒక్క రోజులో 231 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,75,921కి చేరింది. తాజాగా ఒకరి మృతితో మొత్తం మరణాలు 7,134కి చేరాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement