తెలంగాణలో కొత్తగా 4,693 కేసులు

4693 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 4,693 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,16,404కు చేరింది. గడిచిన 24 గంటల్లో 33 మంది మరణించగా.. ఇప్పటివరకు 2,867మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 6876 మంది డిశ్చార్జ్‌ అవ్వగా.. ఇప్పటివరకు 4,56,620 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 56,917 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 71,221 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 1,38,94,962 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.

మే 31వరకు సెకండ్‌ డోస్‌ మాత్రమే : డీహెచ్
మే 31వరకు సెకండ్‌ డోస్‌ మాత్రమే వేస్తామని డీహెచ్ తెలిపారు. సెకండ్‌ డోస్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదన్నారు. నేరుగా సెంటర్‌కు వెళ్లి సెకండ్‌ డోస్‌ వేయించుకోవచ్చని తెలిపారు. అయితే, అనవసరంగా రెమిడెసివిర్‌ వాడితే.. బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే ప్రమాదం ఉందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌(డీఎంఈ) తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top