వంద శాతం ఓటింగ్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వంద శాతం ఓటింగ్‌పై అవగాహన

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

సేలం: నామక్కల్‌ – వ్యవసాయ, ఉద్యానవన శాఖల తరఫున నామక్కల్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలో వంద శాతం ఓటింగ్‌ శాతాన్ని ప్రోత్సహించేందుకు, టన్ను ధాన్యం, కూరగాయలను పంపిణీ చేస్తూ వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ దుర్గామూర్తి అధ్యక్షత వహించి, కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నామక్కల్‌ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల్లో వంద వాతం ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఎన్నికల రోజు ఏప్రిల్‌ 23 అని తెలియజేయడానికి, 230 కిలోల మొక్కజొన్న, పప్పుధాన్యాలతో తయారు చేసిన వంద శాతం ఓటింగ్‌ అవగాహన నినాదాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.ఆయన ఉద్యానవన శాఖ నిర్వహించిన నా ఓటు అమ్మకానికి కాదు అనే అవగాహన ప్రచార కార్యక్రమానికి 800 కిలోల టమాటాలు, నిమ్మకాయలు, ఉసిరికాయలతో బొంబాయి రవ్వ, మెంతి గింజలతో చేసిన ఓటు లోగోతో సెల్ఫీ తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని అవగాహన ప్రచార కార్యక్రమాలను సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement