పసుపు మార్కెట్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పసుపు మార్కెట్‌లో అగ్నిప్రమాదం

Mar 21 2026 5:18 AM | Updated on Mar 21 2026 5:18 AM

సేలం: సేలంలోని పల్లపట్టి ప్రాంతంలో హరి భాస్కర్‌కు చెందిన ఒక పసుపు మార్కెట్‌ ఉంది. ఇక్కడ వివిధ ప్రాంతాల రైతుల నుంచి పసుపును కొనుగోలు చేసి, శుభ్రపరిచి, పెద్దమొత్తంలో వివిధ రాష్ట్రాలకు అమ్ముతారు. గత కొన్ని నెలల్లో అనేక లక్షల విలువైన పసుపు బేళ్లు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేశారు. అది మార్కెట్లో పేర్చబడి ఉంది. ఈ పరిస్థితిలో శుక్రవారం ఉదయం పసుపు మార్కెట్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. ఇది చూసి ఇరుగుపొరుగు చూళమంగళం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్లలో హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పివేశారు. పసుపు మార్కెట్‌ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. విద్యుత్‌ లోపం కారణంగా అగ్నిప్రమాదం జరిగిందా అనే విషయంపై పల్లపట్టి పోలీస్‌స్టేషన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement