యోగాసనంతో బాలిక రికార్డు | - | Sakshi
Sakshi News home page

యోగాసనంతో బాలిక రికార్డు

Jan 25 2026 7:21 AM | Updated on Jan 25 2026 7:21 AM

యోగాస

యోగాసనంతో బాలిక రికార్డు

● తిరుచెంగోడ్‌ అర్ధనారీశ్వర కొండ ఆలయంలోని 1,300 మెట్లు ఎక్కిన బాలిక

సేలం: జుబైర్‌ అహ్మద్‌, ఆయన భార్య అతియా భాను సేలం సెవ్వాయ్‌పేట ప్రాంతంలో నివశిస్తున్నారు. వీరి కుమార్తె జి.హనా సేలంలోని శ్రీవాసవి మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఈమె సేలంలోని శివగురు యోగాసన సాలైలో మురళి అనే ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలో యోగా కూడా నేర్చుకుంటోంది. ముస్లిం మతానికి చెందిన ఈ అమ్మాయి యోగా ఆసనాలు వేయడం ద్వారా రికార్డు సాధించింది. నామక్కల్‌ జిల్లా, తిరుచెంగోడు అర్ధనారీశ్వర పర్వత ఆలయం అడుగుభాగంలో ఉన్న ఆర్ముగస్వామి ఆలయం నుంచి పర్వత శిఖరానికి 1,300 మెట్లు ఎక్కి, ప్రతి మెట్టుపై వివిధ రకాల యోగా ఆసనాలను ప్రదర్శించింది హనా. బాల్యంలోనే వృచ్ఛకాసనం, గరుడాసనం, పురాణ ధనురాసనం, చక్రాసనం, నింథాన పదాసనం, విరాసన అర్ధ కోణాసనం, అర్ధ సలాపాసనం ఆసనాలు వేస్తూ పర్వతాన్ని అధిరోహించింది. హనా ఉదయం 6.45 గంటలకు మొదటి మెట్లు ఎక్కడం ప్రారంభించి ఉదయం 10.30 గంటలకు 1,300 మెట్లు ఎక్కడం ద్వారా తన రికార్డు ప్రయత్నాన్ని పూర్తి చేసింది. ఈ రికార్డు ప్రయత్నంపై హనా విలేకరులతో మాట్లాడుతూ తాను గత కొన్ని సంవత్సరాలుగా యోగా సాధన చేస్తున్నానని తెలిపింది. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే తల్లిదండ్రులను గౌరవించాలని, తదనుగుణంగా ఏదైనా సాధించాలని మురళి మాస్టర్‌ తరచూ సలహా ఇస్తుంటారంది. తాను యోగా చేస్తూ అర్ధనారీశ్వర కొండ ఆలయంలోని 1,300 మెట్లు ఎక్కానని, ఈ రికార్డు సాధించడానికి ఇంకా చాలాసార్లు ప్రయత్నిస్తానని చెప్పింది.

యోగాసనంతో బాలిక రికార్డు 1
1/2

యోగాసనంతో బాలిక రికార్డు

యోగాసనంతో బాలిక రికార్డు 2
2/2

యోగాసనంతో బాలిక రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement