కనులపండువగా శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
తిరువొత్తియూర్: శ్రీవళ్లి, దేవసేన సమేత శివసుబ్రహ్మణ్యస్వామివారి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. చైన్నె పాతచాకలిపేట బసవయ్య వీధిలో ఉన్న కపిల వినాయక దేవస్థానంలో స్కంధ షష్ఠి లక్షార్చన వైభవాలు–2025 ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ వేడుకలు జరుగుతుండగా ప్రతిరోజు అభిషేకాలు, దీపారాధన చేస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రీవళ్లి దేవసేన సమేత శివసుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవానికి మహిళలు, పెద్దలు, చిన్నారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేశారు.
కల్యాణోత్సవంలో పాల్గొన్న మహిళలు
విశేషాలంకరణలో శివసుబ్రహ్మణ్యస్వామి
కనులపండువగా శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం


