చిత్ర ప్రమోషన్‌ ప్రధానంగా మారింది | - | Sakshi
Sakshi News home page

చిత్ర ప్రమోషన్‌ ప్రధానంగా మారింది

Jul 16 2025 9:24 AM | Updated on Jul 16 2025 9:24 AM

చిత్ర ప్రమోషన్‌ ప్రధానంగా మారింది

చిత్ర ప్రమోషన్‌ ప్రధానంగా మారింది

తమిళసినిమా: ఎంఎన్‌ఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎం.నాగరత్నం నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం వళ్లిమలై వేలన్‌. ఇళక్కియ నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఎస్‌.మోహన్‌ కథ, దర్శకత్వం వహించారు. ఆల్డ్రిన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ లో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్‌, దర్శకుడు వి.శేఖర్‌, సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు వి.శేఖర్‌ మాట్లాడుతూ ఈ రోజుల్లో చిత్రాన్ని రూపొందించడం సులభమని, ప్రమోషన్‌ చేయడం ప్రధానంగా మారిందన్నారు. తాము చిత్రాలు చేస్తున్న కాలంలో 250 థియేటర్ల వరకు లభించేవని, ఇప్పుడు పెద్ద చిత్రాలకు 1000 థియేటర్లకం పైగా కేటాయిస్తున్నారని, దీంతో చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదన్నారు. ఈ విధానం మారాలని అన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని దర్శకుడు పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు కుమారస్వామి సీజన్‌ నడుస్తోందని, ఆయన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారని అన్నారు. ఈ చిత్రంలో నటించిన హీరోహీరోయిన్లు కథకు తగ్గట్టుగా ఉన్నారని ఆయన ప్రశంసించారు. తాము చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంటుందనే అభిప్రాయాన్ని చిత్ర నిర్మాత, కథానాయకుడు ఎం.నాగరత్నం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement