గంజాయి విక్రయాలపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయాలపై చర్యలు తీసుకోండి

May 2 2025 1:51 AM | Updated on May 2 2025 1:51 AM

గంజాయి విక్రయాలపై చర్యలు తీసుకోండి

గంజాయి విక్రయాలపై చర్యలు తీసుకోండి

తిరువళ్లూరు: పర్యాటక కేంధ్రమైన పూండిలో విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి, మద్యం విక్రయాలను వెంటనే అరికట్టాలని కోరుతూ గ్రామసభలో స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రతాప్‌ స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మేడేను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామపంచాయతీల్లోనూ గ్రామసభలను నిర్వహించాలని కలెక్టర్‌ ప్రతాప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో ఆయా పంచాయతీ కార్యదర్శుల నేతృత్వంలో గ్రామసభలు జరిగింది. తిరువళ్లూరు జిల్లా పూండిలో జరిగిన గ్రామసభలో కలెక్టర్‌ ప్రతాప్‌, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించి చెట్లు పెంచాలని కోరారు. బాల్యవివాహాలను పూర్తి నిషేధించి సీ్త్ర విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రైతులకు సబ్సిడీ కింద విత్తనాలను పంపిణీ చేశారు. సభలో ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ మాట్లాడుతూ డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత కలైంజర్‌ మహిళా హక్కు నిధికి కింద ప్రతి నెలా రూ.వెయ్యి, గ్రామాలకు రోడ్లు, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను వర్తింప చేసినట్టు తెలిపారు. స్థానిక యువకులు మాట్లాడుతూ పూండిలో పెరిగిన మద్యం, గంజాయి విక్రయాలను అదుపు చేయాలని కోరారు. ప్రభుత్వ బస్సులు సక్రమంగా నడిచేలా చూడాలన్నారు. అర్హులైన వారికి పింఛన్‌లను అందజేయాలని కోరగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు ఆఫీసర్‌ జయకుమార్‌, తహశీల్దార్‌ రజినికాంత్‌, డిప్యూటీ తహశీల్దార్‌ దినేష్‌, డీఎంకే నేతలు మోతీలాల్‌, సెంగైరవి, చిట్టిబాబు, పంచాయతీ మాజీ అధ్యక్షురాలు చిత్రరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామసభలో కలెక్టర్‌కు ఫిర్యాదు

తక్షణం చర్యలు

తీసుకోవాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement