
ప్రాణం తీసిన ఈత సరదా
– నీట మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
యాదమరి : ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..చిత్తూరు మండలం తుమ్మిండపాల్యంకు చెందిన సదా కుమారుడు సిద్దు(11), తమిళనాడు రాష్ట్రం సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజ్కుమార్ కుమారుడు అవినాష్ (13) మండల పరిధి కీనాటంపల్లి పంచాయతీ కోయూరులోని తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చారు. శుక్రవారం గ్రామానికి సమీపంలో ఉన్న కొత్తచెరువు కుంట వద్ద సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. ముందుగా కుంటలోకి దిగి ఆడుకుంటున్న చిన్నారి సిద్దు మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న అవినాష్ సిద్దుని కాపాడే యత్నంలో బురదలో కూరుకుపోయి మత్యువాత పడ్డారు. ఇది గమనించిన అటువైపుగా వెళ్తున్న కొందరు స్థానికులు కాపాడే ప్రయ త్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వస్తే ఇలా మృత్యుఒడికి చేరుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

ప్రాణం తీసిన ఈత సరదా