
జేఈఈ అభ్యర్థుల కోసం డెమో డే
● ఐఐటీ మద్రాసు ● ఫస్ట్ ప్రిన్సిపల్ టీచర్స్ అవార్డుల ప్రదానం
సాక్షి, చైన్నె: జేఈఈ అభ్యర్థులు, తల్లిదండ్రులు క్యాంపస్ను వీక్షించే విధంగా పూర్వవిద్యార్థులు, అధ్యాపకులతో సంభాషణలకు అవకాశం కల్పిస్తూ డెమో డే కార్యక్రమాలకు ఐఐటీ మద్రాసు నిర్ణయించింది. ఈకార్యక్రమాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, విజయవాడ, హైదరాబాద్లలో జరగనున్నాయి. అలాగే, విద్యార్థుల విద్యా ప్రమాణాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన అసాధారణ విద్యావేత్తలను గుర్తించేందుకు ఐఐటీ మద్రాసు శ్రీఫస్ట్ ప్రిన్సిపల్స్ టీచర్స్ అవార్డుశ్రీను ప్రవేశపెట్టింది. ఈ అవార్డులను గురువారం ఎంపికై న వారికి ప్రదానం చేశారు. మద్రాసు ఐఐటీ జేఈఈ అభ్యర్థులు, వారి తల్లిండ్రులను ఆన్లైన్ మోడ్లో డెమోడే కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం ఏర్పాట్లు చేశారు. ఇది ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వవిద్యార్థులతో సంభాషించడానికి, తాజా సమాచారాన్ని పొందడానికి ఉపయోగకరం అని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి.కామకోటి ప్రకటించారు. అలాగే, ప్రీ–యూజీ స్థాయిలో మొదటి సూత్రాల నుంచి బోధించడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రయాణాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన అసాధారణ విద్యావేత్తలను గుర్తించడానికి ఐఐటీ మద్రాస్ ఈ సంవత్సరం శ్రీఫస్ట్ ప్రిన్సిపల్స్ టీచర్స్ అవార్డుశ్రీను కూడా ప్రవేశపెడుతోందని ప్రకటించారు. ఈ ఈవెంట్లలో పరిమిత సంఖ్యలో సీట్లు మాత్రమే ఉన్నందున ఆసక్తిగల జేఈఈ అభ్యర్థులు వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఏ్ట్ట ఞట://ఠీఠీఠీ.్చటజుజీజ్టీఝ.ఛిౌఝ/ఛ్ఛీఝౌ–ఛ్చీ డ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. డెమోడే కార్యక్రమాల ద్వారా, విద్యార్థులు కొత్త కోర్సుల పరిచయం వంటి ఇటీవలి మార్పుల గురించి కూడా స్పష్టత పొందవచ్చు అని సూచించారు. ఐఐటీ మద్రాస్ రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్లను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమం గురించి ఐఐటీ మద్రాస్ డీన్ (అకడమిక్ కోర్సులు) ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాట్లాడుతూ, శ్రీఇది ఆస్క్ ఐఐటీఎం నాల్గవ సంవత్సరం కార్యక్రమం అని, ప్రతి సంవత్సరం వేలాది మంది ఆశావహులు, తల్లిదండ్రులు ఆసక్తిగా పాల్గొనడాన్ని చూశామన్నారు. జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు పైన పేర్కొన్న నగరాల్లోని ఒక్కో వేదికలో ఒక్కోరోజు డెమో డే కార్యక్రమాలు ఉంటాయన్నారు.

జేఈఈ అభ్యర్థుల కోసం డెమో డే

జేఈఈ అభ్యర్థుల కోసం డెమో డే