
జమాబందీలో 1,225 వినతులు
● 190 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
తిరువళ్లూరు: తిరువళ్లూరు తాలుకా పరిధిలో 16 రోజులపాటు నిర్వహించిన జమాబందీలో 1,225 వినతులు వచ్చాయి. వాటిలో 190 మంది అర్హులను గుర్తించి వారికి పట్టాలను పంపిణీ చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జమాబఽందీ ప్రారంభమైంది.
తిరువళ్లూరు తాలుకా పరిధిలో నిర్వహించిన జమాబందీలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ హాజరై వినతులను స్వీకరించారు. మొత్తం 16 రోజలుపాటు నిర్వహించిన జమాబందీలో 1,225 వినతులు రాగా వాటిలో 270 వినతులకు పరిస్కారం చూపారు. చివరి రోజైన శుక్రవారం లబ్ధిదారులకు పట్టాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి హాజరై సహాయకాలను పంపిణీ చేశారు. తహసీల్దార్ రజనీకాంత్, స్పెషల్ తహసీల్దార్ పరమశివం, డిప్యూటీ తహసీల్దారులు కలైసెల్వి, దినేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉదయకుమార్, సుకన్య, పొన్మలర్ గ్రామ నిర్వాహణ అధికారులు భారతి, కృష్ణన్, కుమరన్ సర్వేయర్ హెడ్ ధనశేఖర్, డీఎంకే నేతలు పొన్పాండ్యన్, నేతాజీ, ఎత్తిరాజ్ పాల్గొన్నారు.